April 15, 2013

నొప్పులతోనే చంద్రబాబు పాదయాత్ర

విశాఖ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు రోజుల విరామం తర్వాత సోమవారం కాగా చంద్రబాబునాయుడును రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తనయుడు, సినీ హీరో కల్యాణ్‌రామ్ సోమవారం ఉదయం విశాఖలో కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సాయంత్రం నుంచి తిరిగి పాదయాత్ర చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం శృంగవరం నుంచి 'వస్తున్నా మీకోసం' యాత్ర నిర్వహించనున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఈరోజు ఆరు కిలోమీటర్లు నడవనున్నారు. ఈరోజు రాత్రికి గాంధీనగర్‌లో బస చేయనున్నారు. కాలి గాయం కారణంగా డాక్టర్ల సూచన మేరకు పాదయాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.