April 15, 2013
బాబును కలిసిన కల్యాణ్రామ్
నాతవరం మండలం శృంగవరంలో బసచేసిన చంద్రబాబును సోమవారం నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నటుడు కల్యాణ్రామ్ కలిశారు. విశాఖ నుంచి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో ఇక్కడకు వచ్చిన కల్యాణ్రామ్ 11.55 గంటలకు చంద్రబాబు ఉన్న బస్సులోకి వెళ్లారు. సుమారు గంటకుపైబడి ఆయనతో మంతనాలు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనను విలేకర్లు.. బాబుతో భేటీపై ప్రశ్నించగా సమాధానమివ్వకుండా కారెక్కి వెళ్లిపోయారు.
Posted by
arjun
at
11:24 PM