April 5, 2013

నాడు ఎన్టీఆర్, ఈ రోజు చంద్రబాబునాయుడు 'మేమున్నాం' అంటూ భరోసా

నిజమైన పెదకాపు.. చంద్రబాబే

హైదరాబాద్: నిజమైన పెదకాపు చంద్రబాబునాయుడేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చందు సాంబశివరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాపు కులస్తులకు నాడు ఎన్టీఆర్, ఈ రోజు చంద్రబాబునాయుడు 'మేమున్నాం' అంటూ భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.

గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత రిజర్వేషన్లు దెబ్బతినకుండానే కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించడమే కాపుల పట్ల తెలుగుదేశం పార్టీ నిబద్ధతతకు నిదర్శనమని సాంబశివరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.