టీడీపీ కార్యకర్తలపై ప్రత్యర్థి పార్టీల నేతలు అట్రాసిటీ కేసులు పెట్టించి
వేధిస్తున్నారని సత్యనారాయణరెడ్డి అనే కార్యకర్త చంద్రబాబు దృష్టికి
తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన బాబు.. కార్యకర్తలపై కేసులు, కోర్టు
వ్యవహారాల వంటి అంశాల్లో పార్టీ వారికి అండగా ఉంటుందని, ఎంత ఖర్చయినా
భరిస్తుందని భరోసా ఇచ్చారు.