April 5, 2013

సర్‌చార్జీలు వైఎస్ చలవే: లోకేశ్

హైదరాబాద్: ప్రజలపై ఎఫ్ఎస్ఏ భారాన్ని మోపడం మొదలు పెట్టింది వైఎస్సే నని నారా లోకేశ్
వ్యాఖ్యానించారు. ట్విటర్‌లో ఈ వ్యాఖ్య చేశారు. తన వ్యాఖ్యకు మద్దతుగా ప్రభుత్వ ఉత్తర్వు ప్రతి ని జత చేశారు. ఎఫ్ఎస్ఏ చార్జీల వసూలుకు అనుమతిస్తూ వైఎస్ సర్కారు 2009లో ఆదేశాలిచ్చిందని, ఈ మేరకు ఈఆర్‌సీ ముందు ప్రతిపాదనలు ఉంచాలని డిస్కంలను ఆదేశించిందని ఈ ఉత్తర్వుల్లో ఉంది. "2004- 09 మధ్యలో వైఎస్ ఒక్క మెగావాట్ ఉత్పత్తి కొత్తగా సాధించలేదు. పైగా 29-6-09 నుంచి ఎఫ్ఎస్ఏ వసూలుకు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీకి ఇవి తెలుసుకోవాలని ఉందా'' అని లోకేశ్ ప్రశ్నించారు.