April 5, 2013

టీడీపీ సంతకాల సేకరణకు అనూహ్య స్పందన

ఆర్మూర్అర్బన్: పట్టణంలోని జిరాయత్‌నగర్‌లో  సంతకాల సేకరణ కొనసాగింది. రోడ్డుగుండా వె ళ్లే ప్రజలు పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ సంతకాలు చేశారు. ప్రభు త్వం విద్యుత్ చార్జీలు, సర్‌చార్జీల వ సూళ్ల పేరిట పేద ప్రజలపై మోయలే ని భారం వేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు జివి.నర్సింహరెడ్డి, కౌన్సిలర్ గం గామోహన్‌చక్రు, స్వామియాదవవ్, మామిడి లక్ష్మీనారాయణ, పి.పద్మారా వు, నూకల ప్రభాకర్ పాల్గొన్నారు.

ఆర్మూర్‌రూరల్: మండలంలోని అంకాపూర్‌లో చేపట్టిన కార్యక్రమంలో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉ పసంహరించుకోవాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అ ధ్యక్షుడు కిశోర్‌రెడ్డి, సామ గంగారెడ్డి, మోహన్, గడ్డం లింగారెడ్డి, ఆలూరు నారాయణరెడ్డి, ఎన్.గంగారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాక్లూర్: మండల పరిధిలోని గం గరమంద గ్రామంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపాల్ నగేష్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ పంటలు ఎండిపో యి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉంటే ప్రభుత్వం ముందుచూపుతో కరెంట్ స మస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీబీ.గోవర్దన్, రజినీష్, రాజేశ్వర్‌రావు, షేక్ హైమద్, న రేందర్ తదితరులు పాల్గొన్నారు.

భీమ్‌గల్: మండల కేంద్రంలో సం తకాల సేకరణ ప్రారంభమైంది. భిం చారు. ప్రజల నడ్డి విరిచే విధంగా ప్ర భుత్వం విద్యుత్ చార్జీలను పెంచిందని మండల కన్వీనర్ గంగాధర్‌గౌడ్ అ న్నారు. కార్యక్రమంలో గంగాధర్‌గౌడ్, పతాని లింబాద్రి, హకీం, కర్నె రాజేశ్వ ర్, పార్ధసారథి, హన్మంతు, అఫ్సర్ పా ల్గొన్నారు.

బాల్కొండ: టీడీపీ నాయకులు మండల కేంద్రంలో సంతకాల సేకరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వి లేఖరుల సమావేశంలో తెలుగు యు వత జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌యాదవ్ మాట్లాడుతూ టీడీపీతో పాటు వి పక్షాలు విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆందోళనలు చేస్తుంటే ముఖ్యమంత్రి కి రణ్‌కుమార్ నియంతలా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశం లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజన్న, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయ కులు రాజు, గంగారెడ్డి, రాజేందర్, హ రికృష్ణ, రాజుగౌడ్, మైనారిటీ నాయకు లు హమీద్, అజీం తదితరులు పాల్గొన్నారు.