April 5, 2013

చార్జీలు తగ్గించే వరకు.. ఉద్యమం ఆగదు

నర్వ: పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేవరకు ఉద్యమం ఆగదని ఎమ్మె ల్యే దయాకర్‌రెడ్డి హెచ్చరించారు. వి ద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మండల కేం ద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల ను గురువారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ధరలు పెంచడమేకాని దించడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

రాబోవు ఎన్నిక ల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని హె చ్చరించారు. టీడీపీ అధికారంలోకి వ స్తే రైతులకు రుణాలు మాఫీచేసి ధ రలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీక్షలో పార్టీ మండల అ ధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డితో పాటు వెంకటేశ్వర్‌రావ్, శ్రీనివాస్‌రెడ్డి, జగన్నాథం, వెంకట్‌రెడ్డి తదితరులు కూ ర్చున్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రావ్, నాయకులు చంద్రశేఖ ర్ రెడ్డి, వెంకటయ్య, మారెప్ప, హ న్మంతు, కుర్మారెడ్డి, కృష్ణయ్య తదితరు లు పాల్గొన్నారు.

మక్తల్: స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద టీడీపీ చేపట్టిన రిలే నిరహార దీక్ష లో టీడీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు బి.చంద్రకాంత్‌గౌడ్ పాల్గొని ప్రసం గించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు. కిరణ్ ప్రభుత్వం పే దలపై భారం మోపడమే తప్పా వారికష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పెంచిన చార్జీలను తగ్గించాలని ఆయన డి మాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కె.చంద్రశేఖర్‌గౌడ్, అనంత్‌రెడ్డి, బాల్‌రెడ్డి, లక్ష్మణ్, మధు, రాజశేఖర్‌రెడ్డి, రహీంపటేల్, అన్వర్, వెంకట్రాములు, విశ్వనాథ్, మనాన్, గోపాల్, భీమేష్ పాల్గొన్నారు.

మగనూర్: మండల కేంద్రలో చే పట్టిన రిలే దీక్షలను టీడీపీ మండల అ« ద్యక్షుడు శివకుమార్‌రెడ్డి ప్రారంభించ గా దీక్షలో మాజీసర్పంచ్ రవీందర్, విండో డైరెక్టర్ అశోక్‌గౌడ్, తిప్పన్నగౌడ్, తాయప్ప, ఆంజనేయులు. కృష్ణమూర్తితో పాటు పలువురు కూర్చున్నా రు. వీరికి ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి సం ఘీభావం తెలిపి ప్రసంగించారు. రైతులకు 9గంటల పాటు విద్యుత్‌ను అందిస్తామన్న ప్రభుత్వం 3గంటలు ఇ వ్వడం లేదని ఆయన మండిపడ్డారు. అనంతరం సంతకాలు సేకరించారు. దీక్షలో కూర్చున్న నాయకులకు ఎమ్మె ల్యే నిమ్మరసమిచ్చి దీక్ష విరమింప జేశా రు.

ఆత్మకూర్: మండల కేంద్రంలో చేపట్టిన దీక్షల్లో పీఏసీఎస్ ఉపాధ్యక్షు డు నారాయణ రెడ్డి, టీడీపీ నేతలు మే కల సత్యన్న, ఎస్టీడి శ్రీనివాసులు, గా లిపంపు శ్రీను, గోపన్‌పేట అంజి, కొంకని వానిపల్లి సుధాకర్‌రెడ్డి, అమరచింత ఫయాజ్, నర్సింహ, పిన్నంచర్ల వెంకటేష్ కూర్చున్నారు. దీక్షకు ఎమ్మె ల్యే దయాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అ ధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, టీడీపీ నేత లు రామలక్ష్మా రెడ్డి, శ్రీనివాస్ రావు, అ శ్విన్ కుమార్,పుట్నాల సురేష్, రమే ష్, తిరుమలేష్, సింగంపేట రాజు, పి ట్టల ధర్మయ్య, లక్ష్మయ్య, గొల్ల వల్లన్న, గడ్డం రాములు, నాగిరెడ్డి, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.