April 5, 2013

పతనం అంచుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం



జన్నారం: కరెంట్ చార్జీలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన రిలే నిరహార దీక్షలు రెండవ రోజు గురువారం కొనసాగాయి. ఎంపీ తనయుడు రితేష్ రాథోడ్ దీక్షా శిభిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రజలకు న్యాయమైన పాలన అందించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు.

దీక్షా శిభిరంలో నాయకులు కొంతం శంకరయ్య, తాళ్లపల్లి రాజేశ్వర్, దుర్గం గంగాధర్, ఎండి యూసూఫ్, దత్తు, నర్సింహులు మజూరోద్దిన్, రమేష్, జాడి వెంకట్, లక్ష్మణ్, సంజీవ్, శంకరయ్య, వాసాల శ్రీనివాస్, మంత్రి లచ్చన్న, జక్కుల సురేష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.