April 5, 2013

నాగార్జున భూ వ్యవహారాలపై విచారణ చేయాలి: రేవంత్

హైదరాబాద్ : సినీ నటుడు నాగార్జున భూ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. "రాజధాని నడిబొడ్డున హైటెక్ సిటీకి కూతవేటు దూరం లో ఉన్న గురుకుల ట్రస్టు భూముల్లో నాగార్జున ఆక్రమణకు పాల్పడ్డారు. అ క్కడ తన భూమికి ఆనుకొని ఉన్న చెరువును పూడ్చి పధ్నాలుగు ఎకరాలు ఆక్రమించారు. వైఎస్‌ను పట్టుకొని దాన్ని రెగ్యులరైజ్ చేయించుకొన్నారు.

సినిమాల నిర్మాణం కోసం అన్నపూర్ణ స్టూడియోకు భూమిని తీసుకుని అందులో వాణిజ్య కార్యకలాపా లు నిర్వహిస్తున్నారు. అందులో పెట్టిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో పేదలకు రాయితీఇస్తారా అని అడిగితే.. నాణ్యత పడిపోతుందని నాగార్జున అన్నా రు. ఆక్రమించుకొన్న భూముల

సన్నాసి అనే కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వలేదు
కేసీఆర్ సన్నాసి అనే ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ సన్నాసుల పార్టీ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఈ వ్యాఖ్య చేశారు. సన్నాసుల మాటలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ను క్రమబద్ధీకరించుకొంటే న్యా యం...పేదల పిల్లలకు రాయితీ ఇస్తే అన్యాయమా?'' అని మండిపడ్డారు.