March 13, 2013

మీకు బంగారు భవిష్యత్

వీరవాసరం/పాలకోడేరు/భీమవరం: చంద్రబాబు నాయుడు వస్తు న్నా మీకోసం పాదయాత్రను మంగళ వారం ప్రారంభించిన కొద్దిసేపటికే శృంగవృక్షం జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించారు. రహదారిపై నుం చి అకస్మాత్తుగా స్కూలు బాట పట్టా రు. హైస్కూల్లోకి వెళ్ళిన చంద్రబాబుకు స్కూలు విద్యార్థులు హర్షధ్వనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంలో చంద్రబాబు విద్యార్థులను ప లు విధాలుగా ప్రశ్నించారు. ఇది ప్రైవే టు స్కూలా, ప్రభుత్వ పాఠశాల, మ ధ్యాహ్న భోజన పథకం బాగుందా అని చంద్రబాబు ప్రశ్నించిగా బాగుందని విద్యార్థులు చెప్పడంతో అలా అని చెప్పమన్నారా.. అంటూ ప్రశ్నించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో తెలుగుదేశం పార్టీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఎప్పటి నుంచి అమలు చే స్తుందో తెలుసా అంటూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నించారు. అదే విధంగా మీ పాఠశాలలో నూతన భవనాన్ని, అదనపు తరగతుల భవనాన్ని నిర్మించడానికి ఎమ్మెల్యే శివరామరాజు కృషి చేశారని, ఎమ్మెల్యేను విద్యార్థు లకు చూపించారు. మీకు బంగారు భ విష్యత్ ఉంటుందని, విద్యార్థుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎన్టీ రామారావు, అల్లూరి సీతారామరాజులు తెలుసా అంటూ ప్రశ్నించి ఒక లక్ష్యం కోసం ఆదర్శమూర్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంలో డీఈడీకి చెందిన టీచర్లు చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.

అది చదివిన చంద్రబాబు ఉపాధ్యాయ పోస్టులలో 40శాతం మహిళలకు రిజర్వేషన్ అమలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో సెట్ పరీక్షలు లేకుండా చేస్తామన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామల క్ష్మీ, ఎమ్మెల్యే శివరామరాజు, రాష్ట్ర కా ర్యదర్శి మంతెన వెంకటసత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను), ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఉన్నారు.