March 13, 2013

వస్తున్నా మీకోసం' రెండో రూట్‌మ్యాప్ రెడీ

ఏలూరుసిటీ : వస్తున్నా.. మీకోసం పాదయాత్ర రెండో రూట్ మ్యాప్ రెడీ అయింది. జిల్లాలో చంద్రబాబు పాదయాత్రకు సంబంధించి తొలుత 10 రోజులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లాలో ప్రజాప్రతినిధులు కోరిక మేరకు మరో రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు వస్తున్నా..మీకోసం పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండో రూట్‌మ్యాప్‌ను రెడీ చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు పాదయాత్ర కొనసాగేలా జిల్లా తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. రెండో రూ ట్‌మ్యాప్ వివరాలు ఇలా ఉన్నాయి.*16వ తేదీ తణుకు మండలం పైడిపర్రు నుంచి చంద్రబాబు యాత్ర ప్రారంభమై తణుకు రైల్వే ఓవర్‌బ్రిడ్జి సెంటర్, నరేంద్ర సర్కిల్ సెంటర్, ఉండ్రాజవరం రోడ్, నేషనల్ హైవే, ఎన్‌జీవో కాలనీ, అజ్జరం కాలనీ వరకు నిర్వహిస్తారు.

అనంతరం నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలం అజ్జరం- వెంకట్రాయపురం చేరుకుని అజ్జరం బ్రిడ్జి మీదుగా ప్రయాణించి కాకరపర్రు హైస్కూలుకు చేరుకుని చంద్రబాబు రాత్రి బస చేస్తారు. 16వ తేదీన మొత్తం 10.5 కి.మీ. చంద్రబాబు పాదయాత్ర నిర్వహిస్తారు.*17వ తేదీ కాకరపర్రు హైస్కూల్ నుంచి బయలుదేరి కాకరపర్రు, శ్రీపర్రు, ఉసునుమర్రు, కానూరు మీదుగా నిడదవోలు మండలం మునిపల్లి, పెండ్యాల సెంటర్, కలవచర్ల వరకు పాదయాత్ర నిర్వహించి, కలవచర్ల దాటిన తర్వాత వీరమనేని రామకృష్ణ ఫీడ్స్ వద్ద రాత్రి బస చేస్తారు. 17వ తేదీ మొత్తం 13.7 కిలో మీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర నిర్వహిస్తారు.

*18వ తేదీ వీరమనేని రామకృష్ణ ఫీడ్స్ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమై నిడదవోలు మండలం డి.ముప్పవరం, పందలపర్రు, పురుషోత్తమ పల్లి మీదుగా కొవ్వూరు నియోజకవర్గంలోని ముద్దూరు బ్రిడ్జికి చేరుకుని, మద్దూరు మీదుగా చాగల్లు మండలం చంద్రవరం వద్ద ఉండవల్లి వెంకటరామారావు తోటలో రాత్రి బస చేస్తారు. 18వ తేదీ మొత్తం 10.1 కి.మి మేర చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుంది. *19వ తేదీ ఉదయం చాగల్లు మండలం చంద్రవరం ఉండవల్లి వెంకటరామారావు తోట నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమై చంద్రవరం ఎన్‌టీఆర్ విగ్రహం సెంటర్, మల్లవరం, గౌరీపల్లి, పశివేదల, నందమూరు మీదుగా కొవ్వూరు కంఠమని నారాయణ గ్రౌండ్స్‌కు చంద్రబాబు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు.

19వ తేదీ మొత్తం 9.1 కిలో మీటరు పాదయాత్ర కొనసాగుతుంది. * 20వ తేదీ కొవ్వూరు కంఠమని నారాయణ గ్రౌండ్స్ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమై కొవ్వూరులోని ఎన్‌టీఆర్ విగ్రహం సెంటర్, కొవ్వూరు బ్రిడ్జి టోల్‌గేట్ వరకు కొనసాగి తూర్పుగోదావరి జిల్లాకు చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుంది. 20వ తేదీ మొత్తం 3.9 కి.మి మేర చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో కొనసాగుతుంది. మొత్తం మీద రెండో సారి 47.3 కిలో మీటర్లు చంద్రబాబు పాదయాత్ర కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేసింది.