March 13, 2013

బాబ్లీ'పై సర్కారు మొద్దు నిద్ర

హన్మకొండ : బాబ్లీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, తెలంగాణలో ని ఆరు జిల్లాల రైతాంగం భవిష్యత్తు ప్రమాదంలో పడబోతున్నా పట్టింపులేదని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థా యిలో ధ్వజమెత్తారు. సుబేదారిలోని రాయల్ ఫంక్షన్‌లో సోమవారం టీడీపీ జిల్లా విస్త­ృత స్థాయి సమావేశం జరిగింది. నేతలు తమ ప్రసంగాల్లో బాబ్లీ, కరెంట్ కోతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌ను ప్రధాన టార్గెట్‌గా చేసుకున్నారు.టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి అధ్యక్షతన జరిగిన విస్త­ృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన వక్త లు బాబ్లీ వల్ల తెలంగాణాకు తాగునీ రు, సాగునీటి విషయంలో శాశ్వతంగా జరగనున్న అపార నష్టాలను గణాంకాలతో సహా వివరించారు. బాబ్లీకి వ్యతిరేకంగా ఇప్పటికైనా ఉదృత స్థాయిలో ఉ ద్యమం సాగించకపోతే భవిష్యత్‌తరా లు కూడా మనల్ని క్షమించరన్నారు.

గో దావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ని ర్మించిన బాబ్లీతోపాటు మరో 14 ప్రాజెక్టుల గురించి సమాచారాన్ని టీడీపీ ఎ న్నో సార్లు, పలు వేదికలపైనా, సుప్రీం కోర్టులో సైతం సాక్ష్యాలతో సహా అందచేసినప్పటికీ కేంద్రం, రాష్ట్రంలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమాత్రం ప ట్టించుకోలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోనాల కోసం ఆ పార్టీతో అంటకాగున్న టీఆర్ఎస్ సైతం దగుల్బాజీ మాటలు మాట్లాడుతోందన్నారు. బాబ్లీకి, కరెంట్ కోతలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టనున్నట్టు ప్రకటించింది.

లోతుగా చర్చసమావేశంలో బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు పర్యవసానం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, బాబ్లీకి వ్యతిరేకం గా పార్టీ భవిష్యత్తులో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలపై చర్చించింది. విద్యుత్ సమస్య, కోతలు, చార్జీల పెం పు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఇటీవల జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, తత్ఫలితంగా తెలుగు దేశం పార్టీ ఓటమి, పార్టీపరం గా చోటు చేసుకున్న లోపాలపై కూడా సమావేశం సమీక్షించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గెలుపునకు కార్యకర్తలు చేయాల్సిన కృషిపై కూడా చర్చించింది.

ఇటీవల మృతి చెందిన టీడీపీ కార్యకర్త అయితా భాస్కర్, వర్ధన్నపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరు కార్యకర్తలు, హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో మృ తి చెందిన వారికి సంతాప సూచికంగా సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, సీతక్క, నియోజకవర్గ ఇన్‌చార్జీలు గండ్ర సత్యనారాయణ, చల్లా ధర్మారెడ్డి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుం డు ప్రభాకర్, టీడీపీ జిల్లా మహిళా అ ధ్యక్షురాలు గాడిపెల్లి ప్రేమలతా రెడ్డి, టీడీ ఎల్‌పి కార్యాలయ కార్యదర్శి కేలిక కిషన్ ప్రసాద్, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గట్టు ప్రసాద్ బాబు, నేతలు పు ల్లూరి ఆశోక్‌కుమార్, మార్గం సారం గం, అనిశెట్టి మురళీ, సంగని మల్లేశ్వర్, పూజారి సుదర్శన్‌గౌడ్, బయ్య స్వామి, గుండు పూర్ణచందర్, షేక్‌బాబా ఖాద ర్ అలీ తదితరులు పాల్గొన్నారు.