March 13, 2013
టీడీపీకి పైర్వవైభవం తీసుకురావాలి: కాల్వ
పార్టీ ఫిరాయింపులు షురూ..!
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మండలంలో పలువురు పార్టీ ఫిరాయించారు. ఇదే కోవలోనే మిడుతూరు రామచంద్ర ఉన్నారా? అని మంగళవారం షాదీఖానాలో పలువు రు చర్చించుకున్నారు. మైనార్టీ నాయకుడి వివాహానికి టీడీపీ నాయకులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హా జరయ్యారు. కాల్వతో మిడుతూరు రా మచంద్ర మాట్లాడారు. టీడీపీ నాయకులతో ఫొటోలకు ఫోజులిచ్చారు. దీంతో పార్టీ ఫిరాయిస్తున్నారా... అన్న చర్చ మొదలైంది.
ఈ విషయమై ఆ యనను అడగ్గా.. అలాంటిదేమీ లే దంటూ తోసిపుచ్చారు. మాజీ ప్రజాప్రతినిధి కావడంతో పరిచయం ఉండటంతో మాట్లాడానని తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కత్రిమల ప్రభాకర్చౌదరి, నాయకులు పాళ్యం నారాయణస్వామి, టైలర్ భాస్కర్, సంజీవకుమార్, రామాంజనేయులు, లంగాల గౌస్, కరూరు శివశంకర్, హుస్సేన్పీరా, మోహన్ కృష్ణ, శ్రీనివాసులు, సునీల్, జాఫర్, శ్రీ రాములు, సుంకప్ప, షేక్షావలి పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:54 AM