March 13, 2013

కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయండి. కష్టాలు తీరుతాయి

పాలకొల్లు : దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా, బాంబు దాడులు జరిగినా రాష్ట్ర రాజధాని హైదారాబాద్ పాత్ర ఎంతో కొంత కన్పిస్తుందని, ఇం దులో వైఎస్సార్ కుటుంబీకుల ప్రమే యం సైతం ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వస్తున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాల కొల్లు కెనాల్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ ప్రసంగించారు. బుధవారం రాత్రి 7.20 ని. లకు ప్రారంభమైన ప్రసంగం సుమారు 60 నిమిషాలు కొనసాగింది. రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేయడం ఒక్కటే మార్గమని చంద్రబాబు పిలుపునిచ్చా రు. నేను మీ అందరి కోసం గత 170 రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నానని ఇప్పటికి 2,350 కిలోమీటర్లు నడిచానని మీరందరూ కలిసి వస్తేనే అవినీతిపై పోరాటం సాధ్యమవుతుందన్నారు.

ఎన్టీఆర్ సారధ్యం వహించిన హిందుపూర్‌లో ప్రారంభమైన తన పాదయాత్ర నేటికి పాలకొల్లులోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చిందన్నారు. జిల్లాలో తన పర్యటన ఇప్పటికి 5వ రోజుకు చేరుకొందని, ప్రతీ ప్రాంతంలో పాదయాత్రకు పెద్ద ఎత్తున హాజరవుతున్న ప్రజలను గమనిస్తే ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకతను కనబరుస్తున్నారో తెలుస్తుంద న్నారు. 2004 తర్వాత కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్ రాష్ట్రాన్ని దో చేస్తూ విద్యుత్ కష్టాలతో పాటు లక్షలకోట్లు అప్పులు చూపించారని దుయ్యబట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిరికిరిలు పెడుతూ అవినీతిని పెంచుతున్నారన్నారు. అవినీతి పాపం పిల్ల కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నేడు మద్యం ఏరులై పారుతుందని, ఒక్క సెల్ మెస్సెజ్ ఇస్తే మద్యం ఇంటికే అందుతుందని తాగడానికి గుక్కెడు నీళ్ళు లభ్యం కావడం లేదని విమర్శించారు. ఒకప్పటి బీహార్ పరిస్థితి ఇప్పుడు మనరాష్ట్రానికి దాపరించిందన్నారు.

తాము 9 సంవత్సరాల పాలనలో నిప్పులా బతికామని తమ హయాం లో పనిచేసిన నాయకులు, అధికారులు ఇప్పుడు హాయిగా ఉన్నారని, వైఎస్సార్ పాలనలో పనిచేసిన నాయకులు, అధికారుల్లో పలువురు చంచల్‌గూడా జైలులో ఊచలు లెక్కబెడుతున్నారన్నారు. ప్రజలలో చైతన్యం రావడం ద్వారానే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమవుతుందని, టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాకుండా అవినీతిని అరికడతామని హామీ ఇచ్చారు