March 13, 2013

క్షీరపురిలో 'చంద్ర' శోభ


ఏలూరు: క్షీరపురిలో 'చంద్రుడు' వెలిగిపోయాడు. మ హిళలు హారతులు పట్టారు. పిల్లలు చెంగుచెంగు నా పాదయాత్ర వెంట పరుగులు తీశారు. వృద్ధులు రక్షణ వలయాన్ని ఛేదించుకుని ఆయనకు చేరువయ్యారు.చల్లంగా ఉండాలంటూ నిండుమనసుతో దీవెనులు ఇచ్చారు. సమస్యలు తీర్చ ండి బాబూ అంటూ బాధితులు. మీరు సీఎం కావాలంటూ అప్యాయతతో మరికొందరు స్వా గతం పలికారు. 'వస్తున్నా..మీ కోసం'..యాత్రలో 163 వ రోజైన బుధవారం ఆయన పాలకొల్లు సమీపా న ఉన్న పూలపల్లి నుంచి కవిటం వరకు మ ధ్యాహ్నం వేళ పాదయాత్రకు ఉపక్రమించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ పెద్దలతో టెలికాన్ఫరెన్సు, జిల్లాలో ఉండి, భీమవరం నియోజకవర్గాల సమీక్షలతో క్షణం తీరిక లేకు ండా బిజీబిజీగా గడిపిన ఆయన ఆ తర్వాత మ ధ్యాహ్నం నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు.

తొలి అడుగులోనే మాకు గుక్కెడు మంచినీళ్ళు దొరకడం లేదంటూ వందలాదిమంది మహిళలు ఖాళీ బిందెలతో ఆయనకు ఎదురేగారు. దీనిపై స్పందించిన ఆయన మంచి రోజులు వస్తాయి, ఇక ఊరూవాడా ఎన్‌టీఆర్ సురక్ష జల పథకం క్రింద సమృద్ధిగా మంచినీరందిస్తామంటూ మహిళలకు భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అక్కడ నుంచి ప్రారంభమైన యాత్ర దారిపొడవునా వందలాది మంది ఆయనతో జతకలిశారు.

పూలపల్లి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు మా ర్గం జనంతో కిటకిటలాడింది.బహుదూరపు బాటసారికి ఎదురేగి స్వాగతం పలికారు. చిన్నారులతో కలిసి వచ్చిన మహిళలు ఆయనకు మంగళహారతులిచ్చారు.తమ సమస్యలను చెప్పుకున్నారు. కరెంటు కోతలు, గ్యాస్ కొరత, తాగునీటి సమస్యలను ఏకరువు పెట్టారు. మీరొస్తేనే కష్టాలు కడతీరతాయంటూ గోడు వెల్లబోసుకున్నారు.

నిరుద్యోగులు.. మీరే మాకు దిక్కంటూ ఆయనకు మొరపెట్టుకున్నారు.దారిపొడవునా ఉన్న దుకాణాలను సందర్శించారు. వారి కష్ట, నష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎంత పెట్టుబడి పెట్టారు, ఆదాయం ఎంత వస్తుందంటూ ఆరా తీస్తూనే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం విన్న తర్వాత నాతో కలిసిరండి కష్టాలు తొలగిపోతాయంటూ భరోసా ఇచ్చారు. రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర నుంచి ఎన్‌టి ఆర్ విగ్రహం వరకు వందలాది మంది ఆయనను అనుసరించారు. కాబో యే సీఎం అంటూ జైజై ధ్వానాలు చేశారు. పూల వర్షం కురిపించారు. డప్పులు వాయిస్తూ యువకులు నృత్యాలు వేశారు. వారితో నాయకులు జత కలిశారు. పాలకొల్లు పట్టణం అయితే జనసంద్రం అయ్యింది. ఎన్‌టి ఆర్ విగ్రహం వద్ద వేలాదిమంది గుడిగూడి ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. పాలకొల్లు దగ్గర నుంచి కవిటం వరకు ఇదే తరహాలో అన్ని చోట్ల భారీ ఎత్తున బాబు రాక కోసం పొద్దుపోయేంత వరకు ఎదురు చూ స్తూనే ఉన్నారు.

ఒక వైపు కాలు సహకరించకపోయినా కాస్తంత వేగంగానే ఆయన తన పాదయాత్రను కొనసాగించారు.ఈ యాత్రలో మా గంటి బాబు, సీతారామలక్ష్మీ, రామానాయుడు, గాదిరాజు బాబు,అంగర రామ్మోహన్, డాక్టర్ బా బ్జి,పీతల సుజాత, శివరామరాజు, పాలి ప్రసాద్, జయరాజు, పాందువ్వ శ్రీను ఉన్నారు.