March 13, 2013

టీడీపీ జిల్లా కమిటీ ఎన్నిక

ఆదిలాబాద్‌టౌన్: ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జిల్లా కమీటీని అధ్యక్షులు, బోథ్ శాసనసభ్యుడు గోడం నగేష్ మంగళవారం విడుదల చేశారు. జిల్లా కమిటీని అధ్యక్షుడితోపాటు 158 మందితో కూర్పు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా నగేస్ ఉండగా ఇద్దరిని ప్రధాన కార్యదర్శులు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు లోలం శ్యాంసుందర్, అబ్దుల్ కలాం ఇప్పటికే ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.

కాగా తాజాగా ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు మొత్తం 159 మందితో జిల్లా కమిటీని అధికారికంగా ప్రకటించారు. పార్టీని బలోపేతం చేసేందుకే కమిటీని ఎన్నుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

ఉపాధ్యక్షులు వీరే...

తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీలో గణపురం ప్రకాష్, ఘన్‌శ్యాం ముండా, అత్రం భగవంత్‌రావు, ఎస్.రామేశ్వర్‌రెడ్డి, బి.లక్ష్మినారాయణ, మొహినొద్ధీన్, సిహెచ్.నాగభూషణం, జె.శ్రీనివాస్, కొప్పుల లచ్చన్న, శనిగరపు చిన్నయ్య, జీఆర్.కుర్మే, వి.మోహన్, రైసాబాను, ఎం.రామేశ్వర్‌గౌడ్, ప్రసాద్‌గౌడ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, గోక గణేష్‌రెడ్డి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వీరితో పాటు 28 మంది ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 21 మంది అధికార ప్రతినిధులు, 17 మంది ప్రచార కార్యదర్శులు, మరో 35 మంది కార్యదర్శులు, ఓ కోశాధికారి, 32 మందితో కూడిన జిల్లా కమిటీని ఖరారు చేశామని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్ మంగళవారం తెలిపారు.

అనుబంధ సంఘాలు...

అధ్యక్షులు

జిల్లా తెలుగు యువత జిల్లా అధ్యక్షునిగా గాజుల ముఖేష్‌గౌడ్ ఎన్నికయ్యారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా సొల్లు లక్ష్మి, జిల్లా తెలుగు రైతు విభాగం అధ్యక్షుడిగా పి.రాజేశ్వర్‌రెడ్డి, జిల్లాఎస్టీ సెల్ అధ్యక్షునిగా జాదవ్ బలిరామ్(బోథ్), జిల్లా బీసీ సెల్ విభాగం అధ్యక్షునిగా బాశెట్టి రాజన్న(ముధోల్), జిల్లా మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షునిగా అబ్ధుల్లా(ఆసిఫాబాద్), జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షునిగా పాలెపు మరళీధర్(సిర్పూర్-టి) ఎన్నికైనట్లు నగేష్ తెలిపారు.