March 13, 2013

పార్టీల ప్రయోజనం కోసమే అవిశ్వాసం


మాజీ మంత్రి కిమిడి   కవిటి: రెండు పార్టీల ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటున్నాయని తెలుగుదేశం నేత, మా జీ మంత్రి కె.కళావెంకటరావు అన్నారు. మంగళవారం కవిటి వచ్చిన ఆయన మాట్లాడుతూ, వైసీపీ స్వలాభానికి, టీ ఆర్ఎస్ సెంటిమెంటు కోసమే అవిశ్వా సం అంటున్నాయే తప్ప, ప్రజల కష్టాలు కోసం కాదని విమర్శించారు. అవిశ్వాసాన్ని సాకుగా చూపించి జగన్ అండ్ కంపెనీ అవినీతి నుంచి తప్పించుకొనేందుకే యత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ అనే విషవృక్షంలో భాగమే వైసీపీ అని దుయ్యబట్టారు.

ఈ రెండు పార్టీల రహస్య ఒప్పందం మేరకే జైలుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు క్యాబినెట్ తీర్మానాలు చేస్తున్నారే తప్ప, ప్రజల సంక్షేమానికి పాటుపడింది శూన్యమని పేర్కొన్నారు. లక్షల కోట్లు బడ్జెట్‌తో అభివృద్ధి సంక్షేమం అని కాంగ్రెస్ చెప్పటమే తప్ప విద్యుత్ ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన వాటా ధనం అందించలేని దుస్థితిలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల అభ్యున్నతి కోసం పోరాటం చేసి, వారి పక్షాన నిలుస్తుందన్నారు. ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీలకు పట్టడంలేదన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోప్సన్ మాజీ సభ్యులు సందానంద్ రౌళో, బీ జయప్రకాష్‌లను పరామర్శించారు. సమావేశంలో టీడీపీ నాయకులు పి.కృష్ణారావు, బి.ప్రకాష్, పీఎం తిలక్, ఎస్.వెంకటరమణ, డి.శ్రీనివాసరావు, పార్టీ మండలాధ్యక్షుడు మణిచంద్ర ప్రకాష్, బి.చిన్నబాబు పాల్గొన్నారు.

అసలు రంగు బయటపడింది

కంచిలి: తల్లి పార్టీ కాంగ్రెస్‌లోనే పిల్ల పార్టీ వైసీపీని విలీనం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ పరోక్షంగా అంగీకరించారని మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు. మంగళవారం కంచిలిలో విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం కావడం తధ్యమన్నారు. విజయమ్మ ప్రకటనతో జగన్ పార్టీ అసలు రంగు బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం పేరిట రూ.90 కోట్లు మంజూరు చేసి, తొమ్మిది కోట్ల రూపాయల మట్టి కూడా తీయలేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బి.కామేష్‌రెడ్డి, జగదీష్ పట్నాయిక్, పీఏసీఎస్ అధ్యక్షుడు తమరాల శోభన్‌బాబు, ఎం.రామారావు తదితరులు పాల్గొన్నారు.