April 27, 2013

రాష్ట్రం గాడిన పడాలంటే బాబు సీఎం కావాలి : సుధీష్ రాంభొట్ల

హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రం కుంభకోణాల రాజధానిగా మారిందని టీడీపీ నేత సుధీష్ రాంభొట్ల వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలన గాడిలో పడాలంటూ చంద్రబాబు సీఎం కావాలని ఆయన స్పష్టం చేశారు. 63 ఏళ్ల వయసులో 2817 కి.మీ మేర చేపట్టిన చంద్రబాబు పాదయాత్రను చారిత్రాత్మక ఘట్టంగా సుధీష్ రాంభొట్ల అభివర్ణించారు.