April 27, 2013

రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా చంద్రబాబుకే ఉంది : టీడీపీ నేతలు

విశాఖపట్నం
: రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా ఒక్క చంద్రబాబునాయుడికే ఉంది అని టీడీ పీ నేతలు ముక్తకంఠంతో తెలిపారు. ప్రజాసమస్యలు తీరాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిందే అని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. చంద్రబాబు పాదయాత్ర వల్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం వచ్చిందని, రాబోయే రోజుల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.