April 27, 2013

టీడీపీ సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు

విజయనగరం : చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు వెళ్తున్న వాహనాలను జిల్లాలో పోలీసులు అడ్డుకుంటున్నారు. చీపురపల్లి, గణపతినగరంలో వాహనాలను నిలిపివేశారు. పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.