April 27, 2013
విశాఖకు చేరుకున్న బాలకృష్ణ
విశాఖపట్నం
: 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగింపు సభలో
పాల్గొనేందుకై ప్రముఖ హీరో బాలకృష్ణ శనివారం ఉదయం విశాఖ చేరుకున్నారు.
ఆయనతో పాటు తారకరత్న, ఎర్రబెల్లి దయాకర్రావు, టీడీపీ ఎమ్మెల్యేలు నగరానికి
చేరుకున్నారు. ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ
కార్యకర్తలు వేదిక వద్దకు తరలివస్తున్నారు. ముగింపు సభ కోసం 11 ప్రత్యేక
రైళ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు అగనంపూడి టోల్గేట్ శివాజీపాలెం వద్ద 60
అడుగులు పైలాన్ స్థూపం తుది మెరుగులు దిద్దుకుంటోంది. పైలాన్ పక్కనే
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం మూడు
గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు.
Posted by
arjun
at
12:11 AM