April 27, 2013

విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు

విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా..మీకోసం' ముగింపు సభ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు సీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.

అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలు లంకలపాలెం వద్ద ఆనందపురం వైపు , శాంఠ్యాం మీదుగా అడవివరం వచ్చే వాహనాలు హనుమంతపాక, జీడుగుళ్ల పాలెం వైపు, గాజువాక మీదుగా విశాఖ వచ్చే వాహనాలు షీలానగర్ వైపు మళ్లిస్తున్నట్లు సీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.