April 27, 2013

విశాఖలో పైలాన్, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

ముగిసిన చంద్రబాబు పాదయాత్ర
పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు,అభిమానులు

విశాఖపట్నం

టీడీపీ శ్రేణులు ముగింపు సభ ఏర్పాట్లను భారీగా చేశారు. జిల్లా అంతటా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానెర్లతో అందంగా అలంకరించారు. దీంతో విశాఖ మొత్తం పసుపుమయంగా మారింది.

2012 అక్టోబర్ 2 న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి చంద్రబాబునాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 208 రోజుల పాటు 2817 కిలో మీటర్ల మేర చంద్రబాబు మహాపాదయాత్ర సాగింది. రాయలసీమ, కోస్తా, తెలంగాణాల్లో 16 జిల్లాలు, 86 నియోజకవర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు నగరాలు, 162 మండలాలు, 1253 గ్రామాల్లో బాబు పాదయాత్ర కొనసాగింది.

తన అరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా 63 ఏళ్ల వయసులో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే కష్టాలు తీరుస్తానని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.
: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా..మీకోసం' పేరిట చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర శనివారం సాయంత్రం ముగిసింది. జిల్లాలోని అగనంపూడి టోల్‌గేట్ శివాజీపాలెం వద్ద 60 అడుగుల పైలాన్‌ను బాబు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు. బాలకృష్ణ, భువనేశ్వరి, లోకేష్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జిల్లాకు తరలివచ్చారు.