April 27, 2013

విశాఖ : పైలాన్‌ను సందర్శించిన టీడీపీ నేతలు

విశాఖపట్నం : ముగింపు సభలో భాగంగా అగనంపూడి టోల్‌గేట్ శివాజీపాలెం వద్ద ఏర్పాటు చేసిన 60 అడుగుల ఎత్తున్న పైలాన్‌ను శనివారం పలువురు టీడీపీ నేతలు సందర్శించారు. నామా నాగేశ్వర్‌రావు, మోత్కుపల్లి, సుజనాచౌదరి, దేవినేని ఉమా తదితరులు సందర్శించారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు చంద్రబాబు నాయడు పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.