April 27, 2013

పైలాన్‌ను ఆవిష్కరించిన బాబు

విశాఖపట్నం
: 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర ముగింపు సభలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అగనంపూడి టోల్‌గేట్ శివాజీపాలెం వద్ద 60 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించారు. పైలాన్ ఆవిష్కరణలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, భువనేశ్వరి, లోకేష్ హాజరయ్యారు.