April 27, 2013

బాబు బస్సు సూపర్! వాహనంలోనే సకల సౌకర్యాలు

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో వినియోగిస్తున్న ప్రచార రథానికి(బస్సు) ప్రత్యేకత ఉంది. ప్రముఖుల పర్యటన కోసం ప్రత్యేక వాహనాలు తయారు చేసే ఓ ప్రముఖ కంపెనీ నుంచి ఈ బస్సును అద్దెకు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఎన్నికల సమయంలో ప్రచారం కోసం ఇదే బస్సును వినియోగించారు. ఆయన పార్టీ సమాజ్‌వాదీ ఎన్నికల గుర్తు కూడా సైకిలే కావడం విశేషం.

ఎన్నికల ప్రచారానికి, వ్యక్తిగత అవసరాలకు, ముఖ్యులతో సమావేశాలకు అనుగుణంగా ఈ బస్సును తీర్చిదిద్దారు. ఇందులో ్రడైవర్ కేబిన్‌తో పాటు మరో మూడు కేబిన్లు ఉంటాయి. తొలి కేబిన్‌లో 15 మంది సమావేశమయ్యేలా సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. చంద్రబాబు తనను కలవడానికి వచ్చేవారితో ఇందులోనే మాట్లాడతారు. జిల్లా, నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తారు. రెండో కేబిన్ పరిమితంగా ఉంటుంది.

కుటుంబ సభ్యులు, వీవీఐపీలు వచ్చినపుడు ప్రత్యేకంగా ముచ్చటిం
చడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ కేబిన్‌లోనే చంద్రబాబు టిఫిన్, భోజనాలు చేస్తారు. ఇక్కడే డ్రెస్సింగ్ టేబుల్ అవీ ఉంటాయి. ఇక మూడో కేబిన్‌లో స్నానపానాదులకు అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి. వార్తలు విశేషాలు తెలుసుకోవడానికి వీలుగా టీవీ, డిష్ యాంటెనా, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి. బస్సులో నుంచి డెక్ పైకి చేరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వాహనం నడిపేందుకు యూపీ నుంచే ్రడైవర్ అమర్‌నాథ్ మిశ్రా వచ్చాడు.