April 27, 2013
రేపు ఇంటికి బాబు
హైదరాబాద్
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన
సుదీర్ఘ పాదయాత్రను ముగించుకుని ఆదివారం తన ఇంటికి చేరుకోనున్నారు. ఏడు
నెలల తర్వాత ఆయన ఇంటి ముఖం చూడనున్నారు. ఆదివారం ఆయన విశాఖపట్నం నుంచి
విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్
విమానాశ్రయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్ను చేరుకుంటారు.
అక్కడ ఎన్టీఆర్కు నివాళులర్పించిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి
చేరుకుంటారు. అక్కడ కొద్ది సేపు పార్టీ శ్రేణులతో చర్చించిన అనంతరం
నివాసానికి వెళతారు.
Posted by
arjun
at
12:17 AM