April 27, 2013

అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలకు చెక్

సగం మంది జైల్లోనే
ఇక కేబినెట్ భేటీలూ చంచల్‌గూడలోనే
అమ్మహస్తం కాదు..మొండి హస్తం
సోదరులతో కలిసి కిరణ్ దందా
కటకటాల్లో జగన్ కాపురం
విశాఖ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు

విశాఖపట్నం

మరోమంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఇంకా పలువురు మంత్రులు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు కేబినెట్‌లో సగం మంది చంచల్‌గూడ జైలుకు వెళతారు. రానున్న రోజుల్లో కేబినెట్ సమావేశాలు అక్కడే ఏర్పాటుచేసుకోవాల్సి వస్తుంది'' అని వెదుళ్లనరవలో జరిగిన బహిరంగసభలో ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పలు పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయని జోస్యంచెప్పా రు. " వైసీపీ జైలుపార్టీగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీబీ ఐ చుట్టూ చక్కర్లు కొడుతున్నది'' అని వ్యంగ్యంగా అన్నా రు.

వైఎస్ తన కుమారుడి కోసం దొంగ కంపెనీలు పెట్టి ంచి చివరకు అతడిని కటకటాల పాల్జేశారని, ఇటువంటి తండ్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. తప్పు చేశాడు కాబట్టే బెయిల్ రాలేదని, అయినా సిగ్గు లేకుండా చంచల్‌గూడ జైల్లో రాజకీయాలు చేస్తున్నాడని జగన్‌పై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సోదరులను అడ్డం పెట్టుకొని సొమ్ములు దండుకుంటున్నారని, ఒక సోదరుడు చిత్తూరులో, మరో సోదరుడు హైదరాబాద్‌లో దందా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధికారంలోకి రాగానే బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు.

మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే దోషులకు ఉరిశిక్షే విరుగుడు అని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులను ఆదుకోవడానికి వారి విద్యార్హతను బట్టి భృతిని అందిస్తామని చెప్పారు. పాఠశాలలకు వెళ్లే ఆడపిల్లలతోపాటు మగపిల్లలకు కూడా సైకిళ్లు ఉచితంగా అందజేస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా రుణాలు ఇప్పిస్తామన్నారు. కాగా, విశాఖ జిల్లాలో శనివారంతో పాదయాత్ర ముగుస్తున్న దరిమిలా జిల్లా డిక్లరేషన్‌ను చంద్రబాబు ప్రకటించారు. విశాఖని ఐటీ కేంద్రంగా మారుస్తామని, బాక్సైట్ ఒప్పందాలు రద్దుచేసి, అధికారంలో ఉన్నంతకాలం అక్కడ తవ్వకాలు జరక్కుండా చూస్తామని హామీ ఇచ్చారు.
: "రాష్ట్ర మంత్రివర్గంలో సగం మంది ముద్దాయిలే. ఇక ముందు కేబినెట్ సమావేశాలు జైల్లోనే జరుగుతాయి'' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. 'అమ్మ హస్తం' పథకం మొండి హస్తంగా మారిందని, ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఉపయోగపడడం లేదని విమర్శించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం నంగినారుపాడు వద్ద శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. 'కళంకిత' మంత్రులను కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం కాపాడుతున్నదని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. "హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓబులాపురం గనుల కేసులో ఏ-4 నిందితురాలు.