April 25, 2013
బయ్యారం ఫ్యాక్టరీకి మేమూ ఓకే: టీడీపీ
'బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు సీమాం«ద్రులు కూడా మద్దతు
ఇస్తున్నారు. అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని మేమంతా కోరుకొంటున్నాం. మా పార్టీ
అధ్యక్షుడు చంద్రబాబు ఆ డిమాండ్ను అధికారికంగా ప్రకటించారు. పార్టీని
బతికించుకోవడానికి టీఆర్ఎస్ ఈ అంశంపై హడావుడి చేస్తోంది. గాలిలో కత్తి
తిప్పుతోంది' అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, సీమాంధ్ర నేత సోమిరెడ్డి
చంద్రమోహనరెడ్డి వ్యాఖ్యానించారు. "బయ్యారంలో ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతి
తెలుగువాడు కోరుకొంటున్నారు.
ఫ్యాక్టరీ వద్దని ఎవరైనా అంటున్నారా? విశాఖ ఉక్కుకు లంకెపెట్టి మాట్లాడటమేంటి? ఇంకా అందులో వివాదం ఏముంది? కేసీఆర్ ఎంపీ. అభివృద్ధి కావాలంటే ఆయన పార్లమెంటులో మాట్లాడాలి. ఇతర పార్టీలను కలుపుకోవాలి. బయ్యారం కోసం విశాఖను ద్వేషించాల్సిన అవసరం లేదు' అన్నారు. ఓబుళాపురం గనుల్లో ఇనుప ఖనిజం తవ్వుకోవడానికి బ్రహ్మణిస్టీల్స్ను తెర ముందు చూపించిన విషయం చిన్నపిల్లలకు కూడా తెలుసునని, దానిని రద్దు చేయడానికి కిరణ్ సర్కారు ఇంత కాలం తీసుకోవడం విచిత్రమని అన్నారు.
Posted by
arjun
at
11:07 PM