April 25, 2013
బాబు సభకు తరలిరండి
ఐ.పోలవరం : విశాఖపట్నంలో ఈ
నెల 27న టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర
ముగింపు సభను విజయవంతం చేయాలని ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి
దాట్ల బుచ్చిబాబు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి 20
బస్సులు, 30 కార్లు సిద్ధం చేశామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు
అధికసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఐ.పోలవరం మండలం పాత ఇంజరంలో
మాజీ ఎమ్మెల్యే చెల్లివివేకానంద స్వగృహం వద్ద బుధవారం నియోజకవర్గ పార్టీ
సమావేశం జరిగింది.
అన్నదాతను పట్టించుకోరే వరదలు, భారీ వర్షాలతో పంటలు ముంపునకు గురై నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. నీలం తుపానుతో నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం నేటికీ రైతులకు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరిచేలు మునిగిపోయి రైతు లు అవస్థలు పడుతున్న సమయంలో రైతు చైతన్యయాత్రలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు.
సమావేశంలో గొలకోటి దొరబాబు, గాదిరాజు రామకృష్ణంరాజు, నడింపల్లి సుబ్బరాజు, టేకుమూడి లక్ష్మణరావు, కాశి పరివాజ్కుమార్, జనిపెల్ల సోమన్న, దాట్ల పృధ్వీ, దాట్ల వర్మ, బొంతు శ్రీరాములు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, చింతా కృష్ణారావు, మాగాపు వీరబాబు, భూపతిరాజు సత్తిబాబురాజు, సుంకర కొండలరావు, జి.సాగర్, ఈతకోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:58 AM