April 25, 2013

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయం

తిప్పర్తి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయం అయ్యాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర బుధవారం మండలంలోని ఇండ్లూరు, పజ్జూరు, ఎర్రగడ్లగూడెం, వెంకటాద్రిపాలెం, ఖాజీరామారం గ్రామాల్లో సైకిల్‌యాత్ర సాగింది.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అవినీతి కుంభకోణాలతో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలను రాబోయే ఎన్నికల్లో గద్దె దించాలని శ్రీనివాస్‌గౌడ్ పిలపునిచ్చారు. విద్యుత్‌ఛార్జీల పెంపు, విద్యుత్‌కోతలను నియంత్రించలేక రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకుంటున్న, ఎస్సీలందరూ బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని కోరుతున్న బీసీలు, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. పాలన దక్షత చంద్రబాబుకే సొంతమన్నారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, ఎల్‌వీ యాదవ్, గుంటూరి వెంకన్న, గుర్రం వెంకట్‌రెడ్డి, రాంబాబు, లక్ష్మయ్య, జానయ్య, మల్లయ్య, నర్సింహ, సైదులు తదితరులు పాల్గొన్నారు.