April 25, 2013

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం:మోత్కుపల్లి


నల్లగొండ : చంద్రబాబునాయుడు సీఎం కావడం ఖాయమని తెలుగుదేశంపార్టీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇవ్వటమే కాకుండా రుణాలన్నింటినీ రద్దు చేయటానికి కృషిచేస్తామని ఆయన అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్ అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందని, రాష్ట్రం ఛిన్నాభిన్నమైందన్నారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబునాయుడు 64 సంవత్సరాల వయసులో రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేశాడన్నారు. ఈ నెల 28న పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్‌కు వస్తున్న చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం పలి కేం దుకు పెద్దఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని కోరారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ అమ్ముకుంటున్నాడని, కోట్ల కొద్ది ధనా న్ని దోచుకుని జగన్ జైలులో ఉన్నాడని, వీరిద్దరినీ రాష్ట్రంలో ముందుకు సాగనిచ్చే ప్రసక్తి లేదన్నారు.

తెలంగాణా ద్రోహి అయిన కేసీఆర్ ఏనాడూ కూడా పార్లమెంటులో మాట్లాడలేదన్నారు. సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ల ఎదుట మాట్లాడని కేసీఆర్ తెలంగాణను తీ

సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే చందర్‌రావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు వంగాల స్వామిగౌడ్, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు తేర చిన్నపరెడ్డి, పాల్వాయి రజనీకుమారి, పటేల్ రమేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహ క కార్యదర్శి బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శులు నెల్లూరి దుర్గాప్రసాద్, బోయపల్లి కృష్ణారెడ్డి, జక్కల అయిలయ్యయాదవ్, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, చావా కిరణ్మయి, కంచర్ల భూపాల్‌రెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, రియాజ్అలీ, బొర్రా సుధాకర్, గార్లపాటి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
సుకువస్తాడంటే నమ్మే ప్రసక్తిలో ఎవరూ లేరన్నారు. కేసీఆర్ తో తెలంగాణా రాష్ట్రం ఏర్పడద ని స్పష్టంచేశారు. సమావేశంలో పాద యాత్ర ముగించుకొని హైదరాబాద్ కు వస్తున్న చంద్రబాబుక ఘనస్వాగ తం పలికేందుకు ప్రజలు, పార్టీ అభిమానులను పెద్దఎత్తున తరలించేందు కు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.