April 25, 2013

ప్రభుత్వ విధానాల వల్లే ప్రజలపై భారం: గాలి ముద్దుకృష్ణమ

హైదరాబాద్

ఇప్పటికే కరెంటు చార్జీలు విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం మళ్లీ సర్‌చార్జ్‌ల పెంపుతో ప్రజలపై మోయలేని భారం పడుతుందని, ఈ బిల్లులను పేద ప్రజలు ఎలా కడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కోత సమస్యలు, చార్జీల పెరుగుదల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు.
: ప్రభుత్వ విధానాల వల్లే ప్రజలపై మోయలేని భారం పడుతుందని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయడు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు కోతల సమస్యను అధిగమిస్తున్నామని చెబుతున్న కిరణ్ సర్కారు కరెంటు కొనుగోలులో అనేక అక్రమాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.