April 25, 2013

జగన్ ఆస్తులను జప్తు చేయాలి: చంద్రబాబు

విశాఖపట్నం

గురువారం విశాఖ జిల్లా సబ్బవరం సమీపంలో జరిగిన ఎలమంచిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాష్ట్రంలో జరిగిన వనరుల దోపిడీ దేశంలో మరెక్కడ జరగలేదన్నారు. అక్రమాస్తుల కేసుల్లో జైలులో వున్న జగన్ అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తులను జప్తు చేస్తే భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి అక్రమాలకు, మోసాలకు పాల్పడరని ఆయన అభిప్రాయపడ్డారు.
: పిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ 2004 తరువాత లక్ష కోట్ల రూపాయల ప్రజా సంపదను దోచుకున్నాడని, గత తొమ్మిదేళ్ల కాలంలో అతను సంపాదించిన ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.