April 25, 2013

టీడీపీ నాయకుల సుడిగాలి పర్యటన

గరుగుబిల్లి : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొనేందుకు టీడీపీ మండల ప్రతినిధులు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బుధవారం ఉపా ధి పనులు జరిగే ప్రాం తాల్లో వేతనదారుల సమస్యలను కురుపాం ఇన్‌చార్జి నిమ్మక జయరాజ్, పార్టీ మండలాధ్యక్షుడు ద్వారపురెడ్డి ధ నుంజయరావు, జిల్లా కార్యదర్శి ముదిలిబాబు విజయవాంకుశంతో పాటు పలువురు అడిగి తెలుసుకున్నారు.

ప్ర భుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ కల లు కార్యక్రమంలో అధికారులు సమస్యలపై అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారన్నారు. అమ్మహస్తం పథకం లో 9 వస్తువులను రూ. 185కే అందిస్తామని చెపుతున్న ప్రభుత్వం అరకొరగా అందిస్తుందన్నారు. 27న నిర్వహించనున్న చంద్రబాబు పాదయాత్ర ము గింపు సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు దాసరి రాధాకృష్ణ, అక్కేన మధు, పలువురు పాల్గొన్నారు.