January 26, 2013
టీడీపీ నేతల కుటుంబాలకు పరామర్శ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో
మృతిచెందిన తెలుగుదేశం నాయకులు కోగంటి అప్పారావు, గూడూరు జితేంద్ర కుటుంబ
సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. నల్లగొండ జిల్లా రామాపురం అడ్డరోడ్డు
వద్ద ఈ నెల 19న జరిగిన కారు ప్రమాదంలో నక్కలంపేటకు చెందిన అప్పారావు,
జితేంద్ర మృతిచెందారు. పాదయాత్ర చేస్తూ శనివారం సాయంత్రం నక్కలంపేట
చేరుకున్న చంద్రబాబు, అప్పారావు ఇంటికి వెళ్లారు. అప్పారావు భార్య
పద్మావతి, కుమారులు పవన్కుమార్, వెంకటేష్ను పరామర్శించారు. పార్టీ కోసం
ఎంతో కష్టపడుతున్న అప్పారావు మృతి చెందటం పట్ల తీవ్ర విచారం వెలిబుచ్చారు.
ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని చెపుతూ కుటుంబ సభ్యులను ఆయన
ఓదార్చారు. జితేంద్ర ఇంటికి వెళ్లి అమ్మ మాధురి, భార్య శిరీషను
పరామర్శించారు. పిన్న వయస్సులోనే జితేంద్ర మృతిచెందటం బాధాకరమన్నారు. ఈ
కార్యక్రమంలో చంద్రబాబు వెంట సీనియర్ నాయకుడు కోగంటి రామారావు, మండల పార్టీ
అధ్యక్షుడు కోగంటి బాబు, మాజీ ఎంపీపీ పరిటాల భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్
మాగంటి బాబు ఉన్నారు.
Posted by
arjun
at
11:37 PM