January 26, 2013

చంద్రబాబును పరామర్శించిన కుటుంబసభ్యులు

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును కంచికచర్లలో సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, సోదరి హైమావతి, మరదులు ఇందిర, మేనల్లుడు ఉదయ్, ఎన్టీఆర్ కుమార్తెలు, కోడళ్లు, ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సతీమణి భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రకు విరామం ఇవ్వాలని కోరమాని అయితే చంద్రబాబు అంగీకరించలేదన్నారు. పాదయాత్రను కొనసాగిస్తానని బాబు చెప్పినట్లు ఆమె తెలిపారు. చంద్రాబాబు మానసికంగా బలంగా ఉన్నారని, నడుము, కాలినొప్ప చంద్రబాబుకు తాత్కాలికమే అని ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ తెలిపారు.