January 26, 2013

తాగు,సాగునీటి కల్పనలో వైఫల్యం

తాగు,సాగునీటి కల్పనలో వైఫల్యంగునీరు, తాగునీరు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులు కుమ్మక్కై ఇసుకను దోచుకుంటున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. జిల్లా మంత్రి సైతం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామంల్లో మౌలిక వసతులు సాగునీరు, తాగునీరు, డ్రైన్ల ఏర్పాటుకు తాను అధికారంలోకి రాగానే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కీసర వంతెన మీద నుంచి గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే బాబు కాలిగాయం నొప్పిని భరించలేక పదినిమిషాలపాటు కుర్చీలో విశ్రాంతి తీసుకున్నారు.

సీఎంగా చూడాలని వుంది బాబుతో విద్యార్థిని ఆశాభావం కంచికచర్ల: తొమ్మిదో తరగతి విద్యార్థిని సుంకర లిఖితా చౌదరి శుక్రవారం చంద్రబాబును కలిసింది. విజయవాడ నుంచి తండ్రి శ్రీనివాస్‌తో కల్సి పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును నందిగామ మండలం అంబారుపేట వద్ద కలిశారు. ఈ సందర్భంగా లిఖితాను చంద్రబాబు నీ లక్ష్యం ఏమిటంటూ ప్రశ్నించారు. డాక్టర్ కావాలనుకుంటున్నాను. మిమ్మల్ని మరల సీఎంగా చూడాలని, రాష్ట్రం అన్నింటా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అని అన్నారు.