January 26, 2013
మీలో రాజకీయ చైతన్యం రావాలి
ప్రస్తుతం విద్యార్థుల
ఆలోచనా ధోరణి మారాలి... రాజకీయంగా కూడా చైతన్యం రావాలి.. అవినీతిని
రూపుమాపేందుకు విద్యార్థులు ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత
చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కంచికచర్ల కేసీఆర్ అండ్ ఎస్ఎస్ క్లబ్లో
శనివారం అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార
వేతనాలు కొనసాగిస్తాం, అగ్రవర్ణాల పేద పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటామని
చెప్పారు. విద్యార్థుల ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.* ఎన్.తేజస్వీ: ఫీజు
రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు కొనసాగించాలి చంద్రబాబు: ఫీజు
రీయింబర్స్మెంట్ను ప్రవేశపెట్టింది టీడీపీయే. మా ప్రభుత్వ హయాంలో ఈ
పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలు చేశాం. ఆర్థిక పరిస్థితి వల్ల పలువురు
చదువుకోలేక పోతున్నారు. టీడీపీ చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది.
తప్పనిసరిగా ఫీజు రీయింబర్ ్సమెంట్, ఉపకార వేతనాలు అందిస్తాం.
* లక్ష్మీ: ఇంజనీరింగ్ విద్యార్థులకు మెరిట్ ఉపకారవేతనాలు అందించాలి చంద్రబాబు: ప్రతిభ అవార్డును నాలెడ్జి పెంచటానికే ప్రవేశపెట్టాం. పిల్లలు బాగా చదువుకుని టాపర్స్గా రావాలి. నేడు జాతీయ స్థాయిలో అన్ని విభాగాల్లో 20 శాతానికి పైగా సీట్లు మనకే వస్తున్నాయి. విద్యార్థులలో పట్టుదలను పెంచి, గుర్తింపు తెచ్చేందుకు దోహదపడే మెరిట్ ఉపకార వేతనాలను కొనసాగిస్తాం* విభావిని: విద్యా వ్యవస్థ సక్రమంగా లేదు. ఉపాధి దొరకటం లేదు. లెర్నింగ్ సిస్టమ్ మారాలి. ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి
చంద్రబాబు: లెర్నింగ్ సిస్టమ్ మారాల్సి ఉంది. అమెరికాలో క్షేత్రస్థాయికి ప్రాధాన్యత ఉండగా, ఇక్కడ క్లాస్రూమ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. క్లాస్ రూమ్లో థియరీ కన్నా క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత ఉంటేనే విద్యార్థులలో సృజనాత్మకత, పట్టుదల పెరుగుతాయి.
పట్టుదల ఉంటే బిల్గేట్స్లా ఉన్నత స్థానం చేరుకోవచ్చు. డెవలప్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి. ఈ విషయమై అధ్యయనం జరగాలి * అభిషేక్: నాయకులు సేవ చేస్తున్నామని చెపుతున్నారు. దేశం ఇంకా వెనుకబడి ఉంది. పదవి ఉన్నా లేకున్న రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలి. చంద్రబాబు: టీడీపీ హయాంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించాం. అభివృద్ధిని చూసేందుకు హైదరాబాదు వచ్చేవారు. ఇప్పుడేమో అవినీతి వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది. ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం ఉండదు. విద్యార్థులు రాజకీయంగా చైతన్యంకలిగి ఉండాలి * విద్యార్థిని: మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి
చంద్రబాబు: ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆడ పిల్లల సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టాం. తర్వాత విద్య, ఉద్యోగాలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి, ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకువచ్చి వడ్డీ లేకుండా అందచేశాం. 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. చట్ట సభల్లో కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మొదట తీర్మానం చేసింది కూడా మేమే
* సౌజన్య: మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయాలి చంద్రబాబు: పోర్టులను అభివృద్ధి చేయాలి. మచిలీపట్నం పోర్టు రావాలి. దాంతో జిల్లా అభివృద్ధి చెందుతుంది * నరేంద్రకుమార్: ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. బడ్జెట్లో నిధులు ఎలా సమకూరుస్తారు.
చంద్రబాబు: నేను చేస్తున్న వాగ్దానాలు ఆచరణ సాధ్యమే. నేను 12 వేల కోట్లతో 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాను. వైఎస్ 85 వేల కోట్లు ఖర్చు చేశారు. ఒక ఎకరానికి కూడా సాగునీరు అందటం లేదు. రోజుకు ఐదారుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పేదల సొమ్ము మద్యం, మైనింగ్, ల్యాండ్ మాఫియా దోచుకుంటోంది. దేశంలో సంపదకు కొదవ లేదు. వాగ్దానాలన్నీ అమలు చేస్తాం
* విద్యార్థి: సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తున్నందున ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలిచంద్రబాబు: నా ఆరోగ్యానికేమీ ఢోకా లేదు. కాలు నొప్పి, నడుం నొప్పి, గొంతు నొప్పి వల్ల ఇబ్బంది పడుతున్నాను. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టేందుకు ప్రజల్లో చైతన్యం కోసం సవాల్గా తీసుకుని పాదయాత్ర చేస్తున్నాను.చంద్రబాబును కళాశాల కరస్పాండెంట్ కె.రామ్మోహనరావు సన్మానించి జ్ఞాపిక అందచేశారు. కళాశాల ప్రెసిడెంట్ వై.వెంకట్రామయ్య, జాయింట్ సెక్రటరీ కె.ఈశ్వర్చందు, ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బయ్య పాల్గొన్నారు.
* లక్ష్మీ: ఇంజనీరింగ్ విద్యార్థులకు మెరిట్ ఉపకారవేతనాలు అందించాలి చంద్రబాబు: ప్రతిభ అవార్డును నాలెడ్జి పెంచటానికే ప్రవేశపెట్టాం. పిల్లలు బాగా చదువుకుని టాపర్స్గా రావాలి. నేడు జాతీయ స్థాయిలో అన్ని విభాగాల్లో 20 శాతానికి పైగా సీట్లు మనకే వస్తున్నాయి. విద్యార్థులలో పట్టుదలను పెంచి, గుర్తింపు తెచ్చేందుకు దోహదపడే మెరిట్ ఉపకార వేతనాలను కొనసాగిస్తాం* విభావిని: విద్యా వ్యవస్థ సక్రమంగా లేదు. ఉపాధి దొరకటం లేదు. లెర్నింగ్ సిస్టమ్ మారాలి. ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి
చంద్రబాబు: లెర్నింగ్ సిస్టమ్ మారాల్సి ఉంది. అమెరికాలో క్షేత్రస్థాయికి ప్రాధాన్యత ఉండగా, ఇక్కడ క్లాస్రూమ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. క్లాస్ రూమ్లో థియరీ కన్నా క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత ఉంటేనే విద్యార్థులలో సృజనాత్మకత, పట్టుదల పెరుగుతాయి.
పట్టుదల ఉంటే బిల్గేట్స్లా ఉన్నత స్థానం చేరుకోవచ్చు. డెవలప్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి. ఈ విషయమై అధ్యయనం జరగాలి * అభిషేక్: నాయకులు సేవ చేస్తున్నామని చెపుతున్నారు. దేశం ఇంకా వెనుకబడి ఉంది. పదవి ఉన్నా లేకున్న రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలి. చంద్రబాబు: టీడీపీ హయాంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించాం. అభివృద్ధిని చూసేందుకు హైదరాబాదు వచ్చేవారు. ఇప్పుడేమో అవినీతి వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది. ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం ఉండదు. విద్యార్థులు రాజకీయంగా చైతన్యంకలిగి ఉండాలి * విద్యార్థిని: మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి
చంద్రబాబు: ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆడ పిల్లల సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టాం. తర్వాత విద్య, ఉద్యోగాలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి, ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకువచ్చి వడ్డీ లేకుండా అందచేశాం. 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. చట్ట సభల్లో కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మొదట తీర్మానం చేసింది కూడా మేమే
* సౌజన్య: మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయాలి చంద్రబాబు: పోర్టులను అభివృద్ధి చేయాలి. మచిలీపట్నం పోర్టు రావాలి. దాంతో జిల్లా అభివృద్ధి చెందుతుంది * నరేంద్రకుమార్: ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. బడ్జెట్లో నిధులు ఎలా సమకూరుస్తారు.
చంద్రబాబు: నేను చేస్తున్న వాగ్దానాలు ఆచరణ సాధ్యమే. నేను 12 వేల కోట్లతో 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాను. వైఎస్ 85 వేల కోట్లు ఖర్చు చేశారు. ఒక ఎకరానికి కూడా సాగునీరు అందటం లేదు. రోజుకు ఐదారుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పేదల సొమ్ము మద్యం, మైనింగ్, ల్యాండ్ మాఫియా దోచుకుంటోంది. దేశంలో సంపదకు కొదవ లేదు. వాగ్దానాలన్నీ అమలు చేస్తాం
* విద్యార్థి: సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తున్నందున ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలిచంద్రబాబు: నా ఆరోగ్యానికేమీ ఢోకా లేదు. కాలు నొప్పి, నడుం నొప్పి, గొంతు నొప్పి వల్ల ఇబ్బంది పడుతున్నాను. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టేందుకు ప్రజల్లో చైతన్యం కోసం సవాల్గా తీసుకుని పాదయాత్ర చేస్తున్నాను.చంద్రబాబును కళాశాల కరస్పాండెంట్ కె.రామ్మోహనరావు సన్మానించి జ్ఞాపిక అందచేశారు. కళాశాల ప్రెసిడెంట్ వై.వెంకట్రామయ్య, జాయింట్ సెక్రటరీ కె.ఈశ్వర్చందు, ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బయ్య పాల్గొన్నారు.
Posted by
arjun
at
11:48 PM