April 12, 2013

మహనీయుడు ఫూలే

బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటు పడిన మహనీయుడు జ్యోతిబా పూలే అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. 187వ జయంతి సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, తాను ఫూలేను ఆదర్శంగా తీసుకుని రాజకీయాలలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. అందులో భాగంగానే యనమలకు ఎన్టీఆర్ తొలిసారిగా ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.