April 12, 2013
చంద్రబాబుకు విశ్రాంతి అవసరం : గరికపాటి
తూ.గో : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ
కాలు వేలు గాయంతో బాధపడుతున్నారు. ఆయనకు శుక్రవారం డాక్టర్లు వైద్య
పరీక్షలు నిర్వహించారు. కనీసం రెండు రోజులైన విశ్రాంతి తీసుకోవాలని
డాక్టర్లు సూచించారు. దీంతో టీడీపీ నేత గరికపాటి రామ్మోహన్తో పాటు మరికొంత
మంది నేతలు బాబును కలుసుకున్నారు.
అనంతరం గరికపాటి మీడియాతో మాట్లాడుతూ విశ్రాంతి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడంలేదని, పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారన్నారు. విశ్రాంతి తీసుకోకపోతే కాలిగాయం ఎక్కువై ఇబ్బంది పడవలసి వస్తుందని డాక్టర్లు చెప్పారని ఆయన అన్నారు. అయితే పాదయాత్ర ఈరోజు కుదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అనంతరం గరికపాటి మీడియాతో మాట్లాడుతూ విశ్రాంతి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడంలేదని, పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారన్నారు. విశ్రాంతి తీసుకోకపోతే కాలిగాయం ఎక్కువై ఇబ్బంది పడవలసి వస్తుందని డాక్టర్లు చెప్పారని ఆయన అన్నారు. అయితే పాదయాత్ర ఈరోజు కుదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Posted by
arjun
at
2:38 AM