April 12, 2013

నేడు విశాఖ జిల్లాలో ప్రవేశం..

బాబు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారంతో ముగుస్తుంది. మార్చి 20న రాజమండ్రిలో ప్రారంభమైన యాత్ర.. కోటనందూరు మండలం కాకరాపల్లి తర్వాత విశాఖ జిల్లాలో ప్రవేశించనుంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో.. నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద విశాఖజిల్లాలోకి చంద్రబాబు అడుగుపెడతారు. మొత్తంగా ఈ జిల్లాలో చంద్రబాబు సుమారు 112 కిలోమీటర్లు నడవనున్నారు. పాదయాత్ర విశాఖపట్నంలో 27వ తేదీన నిర్వహించే బహిరంగ సభతో ముగించనున్నారు.