April 12, 2013
జనం మధ్యే బాబు ఉగాది
పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి ఉగాది వేడుకలను తూర్పు
గోదావరి జిల్లా తుని మండలం ఎన్ సూరవరంలో.. పల్లె జనం, పార్టీ కార్యకర్తల
మధ్య జరుపుకొన్నారు. ఉగాది పచ్చడి ఆరగించి, పంచాంగ శ్రవణం అనంతరం చంద్రబాబు
మాట్లాడారు. పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు,
ఉద్యోగులు అందరికీ మంచి జరగాలని.. ఈ విజయనామ సంవత్సరం మనందరికీ విజయాలు
చేకూర్చాలని ఆకాంక్షించారు. బతికున్నన్నాళ్లు ధర్మబద్ధ జీవితం గడుపుదామని
కార్యకర్తలు, ప్రజలకు ఉద్బోధించారు. తెలుగువారు ఏ దేశంలో ఉన్నా.. ఏ
ప్రాంతంలో ఉన్నా జన్మభూమిని మర్చిపోవద్దని.. తమ ప్రాంతాలకు సేవలు
అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Posted by
arjun
at
12:53 AM