April 12, 2013

బొడ్డు'పై అనర్హత వేటుకు టీడీపీ ఫిర్యాదు

ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావుపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ చక్రపాణికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటా నుంచి టీడీపీ తరఫున గెలిచిన బొడ్డు.. ఇటీవల వైసీపీలో చేరారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయనను శాసన మండలి సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీలు అరిగెల నర్సారెడ్డి, గంగాధర్ గౌడ్, అంగర రామ్మోహనరావు తదితరులు శుక్రవారం మండలి చైర్మన్‌కు ఒక లేఖ అందచేశారు.