April 7, 2013
కొనసాగుతున్న విద్యుత్ ఆందోళనలు
గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, స మస్య పరిష్కారానికి ఎంపీ నిధుల నుంచి బోర్లు వేయిస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఇలాంటి వాటిని పట్టించుకోకుండా కమీషన్లు వచ్చే రోడ్డు పనులు చేయిస్తున్నాడన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.5లక్షలు ఎక్స్గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎక్కడా లే నట్లు ముదిగుబ్బ మండలంలోనే ఉ పాధి పనులలో అవినీతి జరుగుతోందని అధికారులు కుమ్మక్కయ్యారన్నా రు. లక్షలాది రూపాయలు సంపాధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందన్నారు. వీటిపై లోకాయుక్త, మానవహక్కుల కు ఫిర్యాదు చేస్తామన్నారు. అనంత రం జాతీయ రహదారి 205 రోడ్డుపై బైఠాయించారు.
ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. పెంచిన వి ద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. రూ. 32వేల కోట్ల సర్ఛార్జీలు ప్రజలపై భా రం మోపడం దారుణమనీ, దీనికి తగి న మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఇది రైతు రక్షక ప్రభుత్వం కాదనీ, భక్షక ప్రభుత్వన్నారు. అనంతరం పలు వినతులతో కూడిన వినతి పత్రాన్ని ఆర్ఐ బాలకృష్ణకు ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమేష్బా బు, అశ్వర్థరెడ్డి, లింగా నాయుడు, పు ల్లానాయుడు, మహబూబ్పీరా, ఇ మాంసాబ్, పతిరెడ్డి, నారాయణస్వా మి, రాముడు, జింద్రే, తుమ్మల సూరి, తుమ్మలనాయుడు, దామోదర్నాయు డు, గుత్తా నాయుడు, రఘు, బీజేపీ నాయకులు మాలపాటి రామకృష్ణ, వెంకటేష్, సీపీఐ నాయకులు జింకా చలపతి, నాగరాజు, వెంకటనారాయ ణ, మార్కండేయులు, నాగభూషణ, బాబు, వెంకటేష్ పాల్గొన్నారు.
అమడగూరులో... అమడగూరు: పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఇంటి ముందు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, కోతలను నిరసిస్తూ శుక్రవారం మండ ల కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు, సీపీ ఎం నాయకులు విద్యుత్ చేపట్టిన ఆం దోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొ ని ప్రసంగించారు. బస్టాండు కూడలిలో గంటపాటు రాస్తారోకో నిర్వహించి, నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మా ట్లాడుతూ.. ఏ ముఖ్యమంత్రి పెంచని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ ఛార్జీలను కిరణ్కుమార్రెడ్డి పెంచారన్నారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, దొడ్డెం హ రి, సొసైటీ అధ్యక్షుడు సుబ్బయ్య, కృష్ణారెడ్డి, కృష్ణమూర్తి, అబ్దుల్ రసూ ల్, తిరుపాలు, వెంకటేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఉన్నం ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో సంతకాల సేకరణ
కళ్యాణదుర్గంటౌన్: పాలకులు ముందుచూపు లేమితోనే రాష్ట్రంలో అంధకారం అలుముకుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఉన్నం హనుమంతరాయచౌదరి హెచ్చరించారు. రెండో రోజు శుక్రవారం సంతకాల సేకరణను స్థానిక గాంధీ సర్కిల్లో నిర్వహించారు. ఉన్నం మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ చెప్పుకునే పాలకులు విద్యుత్ కోతలతో వారిని నిలువునా ముంచారన్నారు. కరెంట్ కష్టాలన్నింటికి వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతి పాలనే కారణమన్నారు.
అనంతరం విద్యుత్ సంక్షోభంపై దాదాపు మూడువేల మంది పై బడి రైతులు, వినియోగదారులతో సంతకాలను సేకరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు బాదెన్న, ఆర్జీ శివశంకర్, మాజీ ఎంపీపీ మల్లికార్జున, మండల కన్వీనర్లు దొడగట్ట నారాయణ, డీకే రామాంజనేయులు, సింగిల్విండో అధ్యక్షుడు పిట్టి తిమ్మారెడ్డి, లోకన్న, శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ రామ్మోహన్, జీవీ ఆంజనేయులు, జీపీ నారాయణ, టీఎన్ చాంద్బాష, పాపంపల్లి రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు బోయ రాఘవేంద్ర, శర్మాష్, వైపీ రమేష్, కొల్లాపురప్ప, పాలవాయిరాము, బెస్తరపల్లి గోపినాథ్, మురళీ, ఇటుకల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
9:00 AM