April 7, 2013
అధికారంలో కాంగ్రెస్.. అంధకారంలో ఆంధ్రప్రదేశ్
కరెంట్ చార్జీల పెంపుపై టీడీపీ నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తాను తన తల్లి స్వగ్రామం కొమరవోలులో ప్రారంభించడం ఆనందంగా ఉందని బాలకృష్ణ చెప్పారు. సంతకాల సేకరణ పత్రాలపై బాలకృష్ణ తొలి సంతకం చేసి దేవినేని ఉమాకు అందించారు. చార్జీలు, సర్చార్జీల పేరిట ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందని, ముందస్తు ప్రణాళికలు లేకనే కరెంటు భారం వేస్తోందని విమర్శించారు.
టీడీపీ హయాంలో పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సమస్య లేకుండా చేశామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రాన్ని అంధకారంలో ముంచిందని ధ్వజమెత్తారు. 50 యూనిట్లలోపు బిల్లు కట్టక్కర్లేదని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడం హాస్యాస్పదమన్నారు.
Posted by
arjun
at
12:17 AM