April 7, 2013
వైసీపీ దీక్షలు అనర్హత కోసమే!: టీడీపీ
హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యేలు విద్యుత్ చార్జీల తగ్గింపు
కోసం దీక్ష చేస్తున్నారా? లేక తమపై అనర్హత వేటు వేయించుకోవడం కోసం
చేస్తున్నారా? అని టీడీపీ విస్మయం వ్యక్తం చేసింది. "దేనికైనా ఒక సమయం
సందర్భం ఉంటుంది. విద్యుత్ చార్జీలు తగ్గించాలని దీక్షకు కూర్చుని.. దానిని
వదిలి తమ దీక్షను చూసి అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాయడం ఏమిటి?
వాళ్ల దీక్ష దేని కోసం? అనర్హత వేటు వేయించు కోవడానికే దీక్ష చేస్తున్నట్లు
ఉంది'' అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు.
Posted by
arjun
at
12:19 AM