April 7, 2013

చార్జీల భారంతో బతుకు దుర్భరం


శ్రీకాళహసి : విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేటలో సంతకాల సేకరణ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై విద్యుత్ భారం మోపడం వలన వారి బతుకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆందోళనల కారణంగా నామమాత్రంగా ఛార్జీలు తగ్గించి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పెంచిన ఛార్జీలు మొత్తం తగ్గించాలని డిమండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉ«ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్యాల పార్థసార«ధి, పులి రామచం ద్ర, షాకీరాలీ, సంపత్‌కుమార్, రేణుకమ్మ, బుజ్జి, వెంకటేశ్వర్లు, సుధాకర్, నాగయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.