April 7, 2013

బ్రాహ్మణుల అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రత్యేకనిధి

తుని: రాష్ట్రంలో బ్రాహ్మణుల అభివృద్ధికి 50 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. శనివారం ఆయన్ను పాదయాత్ర ఆరంభంలో గోపాలపట్నం వద్ద అన్నవరం సత్యదేవుని దేవస్థానం పురోహితులంతా కలిశారు. తాము ఉద్యోగ భద్రతలేకుండా ఎన్నో ఏళ్ళుగా దినదినగండంగా జీవిస్తున్నామని చె ప్పారు. స్వామివారికి వ్రతాల ద్వారా వస్తున్న ఆదాయంలో కమీషను మాత్రమే తమకిస్తున్నారని దీనివల్ల తాము జీవించడం కష్టంగా మారిందన్నారు
.

తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తే అండగా ఉంటామన్నారు. దీనిపై చం ద్రబాబు మాట్లాడుతూ ప్రముఖ దేవాలయాలన్నీ పురోహితుల వల్లే నడుస్తున్నాయని, పెద్ద ఎత్తున ఆ దాయం కూడా లభిస్తున్నదన్నారు. అటువంటి పురోహితులు కష్టాల పాలవడం విచారకరమన్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామి ఇచ్చారు. జిల్లాకొక వసతి గృహం ఏర్పాటు చేసి ఇళ్ళు, ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేసి బాగోగులు పట్టించుకుంటామని చెప్పారు. తదుపరి పురోహితులు ఆశీర్వచనం పలికి దుశ్శాలువ కప్పారు.