April 7, 2013
జూనియర్... ఏదో ఒక వైఖరి తీసుకో :కోడెల
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో జూనియర్
ఎన్టీఆర్ బొమ్మ ఏర్పాటు చేసినా ఆయన మౌనం వహిస్తుండటాన్ని తెలుగుదేశం
పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆక్షేపించారు.
ఆదివారం సాయంత్రం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన
మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మౌనం వహిస్తుండటం సందేహాలకు
తావిస్తోందన్నారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి టీడీపీ తరపున పోటీ చేసేందుకు టిక్కెట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్. నానికి జూనియర్ మాట లక్ష్మణ రేఖ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. నాడు తన కట్టె కాలే వరకు టీడీపీలోనే ఉంటానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ నేడు పెదవి విప్పక పోతుండటం అయోమయానికి గురి చేస్తోందన్నారు. తన ప్రమేయం లేదనో లేక తనకు చెప్పే నాని వెళ్ళాడనో ఏదో ఒక వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
నాని నూటికి నూరు శాతం అసెంబ్లీలో అడుగు పెట్టలేడు అన్నం పెట్టిన చేతినే తెగనరికే ధోరణి కలిగిన గుడివాడ ఎమ్మెల్యే నాని ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టలేడని తాను సవాలు చేస్తున్నానని డాక్టర్ కోడెల అన్నారు. నాని చేసిన దుర్మార్గాలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
వైసీపీలోకి కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది వెళ్ళారని, వాళ్లు నానిలా నీచాతి నీచంగా మాట్లాడటం లేదన్నారు. ఒక సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరమైన అభిప్రాయం లేని వైసీపీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పతనానికి, మరణానికి కారణం లక్ష్మీపార్వతినేనని, ఆమె మనిషే కాదని కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి టీడీపీ తరపున పోటీ చేసేందుకు టిక్కెట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్. నానికి జూనియర్ మాట లక్ష్మణ రేఖ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. నాడు తన కట్టె కాలే వరకు టీడీపీలోనే ఉంటానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ నేడు పెదవి విప్పక పోతుండటం అయోమయానికి గురి చేస్తోందన్నారు. తన ప్రమేయం లేదనో లేక తనకు చెప్పే నాని వెళ్ళాడనో ఏదో ఒక వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
నాని నూటికి నూరు శాతం అసెంబ్లీలో అడుగు పెట్టలేడు అన్నం పెట్టిన చేతినే తెగనరికే ధోరణి కలిగిన గుడివాడ ఎమ్మెల్యే నాని ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టలేడని తాను సవాలు చేస్తున్నానని డాక్టర్ కోడెల అన్నారు. నాని చేసిన దుర్మార్గాలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
వైసీపీలోకి కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది వెళ్ళారని, వాళ్లు నానిలా నీచాతి నీచంగా మాట్లాడటం లేదన్నారు. ఒక సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరమైన అభిప్రాయం లేని వైసీపీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పతనానికి, మరణానికి కారణం లక్ష్మీపార్వతినేనని, ఆమె మనిషే కాదని కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Posted by
arjun
at
8:55 AM